![]() |
మరి కొన్ని కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్నమాంసం కూర రుచులు |
కావలసిన పదార్థాలు
* పనసపొట్టు - పావుకేజీ
* పల్లీలు - రెండు చెంచాలు
* జీలకర్ర
* ఆవాలు
* మినప్పప్పు
* సెనగపప్పు - చెంచా చొప్పున
* ఎండుమిర్చి
* పచ్చిమిర్చి - నాలుగు చొప్పున
* ఇంగువ - కొద్దిగా
* ఉప్పు - తగినంత
* కరివేపాకు రెబ్బలు - రెండు
* నూనె - అరకప్పు
* గుమ్మడి వడియాలు - కప్పు
* చింతపండు గుజ్జు - రెండు చెంచాలు.
తయారుచేయు విధానం
పనసపొట్టును రెండుసార్లు కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గ్లాసు నీళ్లూ, కొద్దిగా పసుపూ, ఉప్పూ వేసి పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.
తరవాత నీళ్లు వంపేసి పనసపొట్టును గట్టిగా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, పల్లీలూ, మినప్పప్పూ, సెనగపప్పూ, ఎండుమిర్చీ వేసి వేయించుకోవాలి.
అన్నీ వేగాక పచ్చిమిర్చీ, కరివేపాకూ, ఇంగువా వేసేయాలి. నిమిషం తరవాత చింతపండు గుజ్జూ, ఉడికించి పెట్టుకున్న పనసపొట్టూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి.
ఇది కూరలా తయారయ్యేలోగా మరో బాణలిలో మిగిలిన నూనెను తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో గుమ్మడి వడియాలను వేయించి, తీసుకోవాలి. కూర మొత్తం తయారయ్యాక వేయించుకున్న వడియాలను అందులో వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత దింపేయాలి.
No comments:
Post a Comment