
కలోంజి మలై మహి టిక్కా
చేప ముక్కలు - పావుకేజీ పెరుగు - పావు కప్పు జీడిపప్పు ముద్ద - రెండు టేబుల్స్పూన్లు మిరియాలపొడి - అరచెంచా యాలకులపొడి - అరచెంచా ఉప్పు - తగినంత నూనె - పావుకప్పు కలోంజి (బజార్లో దొరుకుతుంది)- టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు - టేబుల్స్పూను.
చేపముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకుని వాటిపై తగినంత ఉప్పూ, పెరుగూ, జీడిపప్పు ముద్ద, మిరియాలపొడి, యాలకులపొడి, చెంచా నూనె వేసి అన్నింటినీ బాగా కలిపి పెట్టుకోవాలి.
పదిహేను నిమిషాల తరవాత ఈ ముక్కలపై కలోంజీ గింజలూ, కొత్తిమీర తరుగూ చల్లాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి రెండు ముక్కలు చొప్పున ఉంచి.. నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీసుకోవాలి.
No comments:
Post a Comment