
చేప కట్లెట్
చేపముక్కలు - పావుకేజీ ఉడికించిన ఆలూ - రెండు ఉల్లిపాయ - ఒకటి కరివేపాకు రెబ్బలు - రెండు గరంమసాలా - చెంచా పసుపు - అరచెంచా గుడ్లు - రెండు బ్రెడ్పొడి - ముప్పావు కప్పు అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్స్పూను ఉప్పు - తగినంత నూనె - వేయించేందుకు సరిపడా.
బాణలిని పొయ్యిమీద పెట్టి.. రెండు చెంచాల నూనె వేడిచేసి అల్లంవెల్లుల్లి ముద్ద వేయించాలి. తరవాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కూడా వేగాక కరివేపాకు రెబ్బలూ, పసుపూ వేయాలి.
రెండు నిమిషాల తరవాత చేపముక్కలు వేసి వేయించాలి. వాటికి ఈ మిశ్రమం పట్టి చేపముక్కలు ఉడికాక, ఉడికించిన ఆలూ కలపాలి. ఇది ముద్దలా తయారయ్యాక గరంమసాలా, తగినంత ఉప్పూ కలిపి దింపేయాలి.
ఇప్పుడు గుడ్ల సొనను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. చేప మిశ్రమాన్ని ఉండల్లా చేసుకోవాలి. ఒకదాన్ని తీసుకుని ముందుగా గుడ్డు సొనలో ముంచి, తరవాత బ్రెడ్పొడిలో అద్ది కాగుతోన్న నూనెలో వేసి వేయించాలి.
ఇలాగే మిగిలిన ఉండల్నీ చేసుకోవాలి. వీటిని ఏదయినా సాస్ లేదా పుదినా చట్నీతో కలిపి వడ్డించాలి.
No comments:
Post a Comment