![]() |
మరి కొన్ని దద్ద్యోదనం రుచులు |
కావలసిన పదార్థాలు
*బియ్యం: అరకిలో
* పండుమిర్చి: 50 గ్రా.
* వెల్లుల్లి: 5 రెబ్బలు
* పచ్చిమామిడికాయ: ఒకటి(తురమాలి)
* ఉప్పు: తగినంత
* నెయ్యి: 3 టేబుల్స్పూన్లు
* ఆవాలు: పావు టీస్పూను
* కరివేపాకు: కట్ట
* ఇంగువ: చిటికెడు
* ఉప్పు: తగినంత
తయారుచేయు విధానం
పండుమిర్చిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరగాలి.
ఓ బాణలిలో నెయ్యి వేసి ఆవాలు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక, పండుమిర్చి ముద్దను కొంచెంకొంచెంగా వేస్తూ వేయించాలి. ఇప్పుడు దీనికి మామిడి తురుము కలిపి పక్కన ఉంచాలి.
ఓ గిన్నెలో కడిగిన బియ్యం, అందులోనే లీటరు నీళ్లు పోసి ముప్పావు వంతు ఉడికిన తరవాత పండుమిర్చి ముద్ద మిశ్రమాన్ని కలపాలి. తగినంత ఉప్పు వేసి సిమ్లో ఉడికించి దించాలి.
No comments:
Post a Comment