![]() |
మరి కొన్ని పొడి రుచులు |
కావలసిన పదార్థాలు
*నువ్వులు - 100 గ్రాములు
* పల్లీలు - 50 గ్రాములు
* పుట్నాలు - 50 గ్రాములు
* మెంతులు - ఒక టీ స్పూను
* జీలకర్ర - ఒక టీ స్పూను
* ఎండు మిరపకాయలు - 10
* ధనియాలు - ఒక టేబుల్ స్పూను
* ఎండు కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూను
* పసుపు - అర టీ స్పూను
* ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం
స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి నువ్వుల్ని వేయించి దించేయాలి.
తరువాత పల్లీలను కూడా వేసి దోరగా వేగనిచ్చి తీసేయాలి. తరువాత పుట్నాలు వేసి వేడెక్కాక తీసేయాలి.
ఈసారి మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా వేగనిచ్చి తీసేయాలి. ఇవన్నీ బాగా చల్లారాక తగింత ఉప్పు, పసుపు వేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
No comments:
Post a Comment