![]() |
మరి కొన్ని సాంబారు రుచులు |
కావలసిన పదార్థాలు
*చింతపండు: రెండు పెద్ద నిమ్మకాయలంత
* ఉల్లిపాయలు: రెండు
* వెల్లుల్లి: 8 రెబ్బలు
* కరివేపాకు: కట్ట
* కొత్తిమీర: కట్ట
* పసుపు: అరటీస్పూను
* పంచదార: 3 టీస్పూన్లు
* ఉప్పు: తగినంత
తాలింపుకోసం
* ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి: తగినన్ని
తయారుచేయు విధానం
సుమారు రెండు లీటర్ల నీళ్లలో చింతపండు రసం తీసి స్టవ్మీద పెట్టి మరిగిస్తూ ఉండాలి.
విడిగా ఓ పాన్లో నూనె వేసి తాలింపు చేశాక అందులోనే చిదిమిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పసుపు వేసి బాగా వేయించాలి.
తరవాత దీన్ని మరుగుతున్న చింతపండు రసంలో వేసి తిప్పాలి.
ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి మరో పావుగంట మరిగించాక దించేముందు పంచదార, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము చేర్చి మరో ఐదు నిమిషాలు మరిగించి దించాలి.
No comments:
Post a Comment