
సగ్గుబియ్యం దోశ
మరి కొన్ని దోసె రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*సగ్గుబియ్యం- అర కప్పు
* పెరుగు- పావు కప్పు
* ఉప్పుడు బియ్యం లేదా మామూలు బియ్యం- ఒక కప్పు
* తరిగిన ఉల్లిపాయ- ఒకటి
* మిరియాల పొడి- అర టీ స్పూను
* అల్లం తురుము- ఒక టీ స్పూను
* కరివేపాకు రెబ్బలు- ఆరు
* ఆవాలు- అర టీ స్పూను
* తరిగిన కొత్తిమీర- ఒక టీ స్పూను
* నూనె- సరిపడా
* ఉప్పు- తగినంత.
తయారుచేయు విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని పెరుగులో, బియ్యాన్ని నీళ్లలో 5 గంటల సేపు నానబెట్టుకుని, రెండిటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము వేసి వేగించాలి. తర్వాత కొత్తిమీర, మిరియాల పొడి కూడా వేసి వాటన్నిట్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమాన్ని దోశల పిండిలో కలిపి పెనంపై నెయ్యి లేదా నూనెతో దోశలు వేసుకోవాలి. ఇవి బంగారు వర్ణంలో ఉంటాయి.
No comments:
Post a Comment