![]() |
మరి కొన్ని వడ రుచులు |
మరి కొన్ని స్నాక్ వడ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*రాజ్మా - అరకప్పు
* ఆలూ
* ఉల్లిపాయ - పెద్దవి ఒక్కోటి చొప్పున
* పచ్చిమిర్చి - రెండు
* గరంమసాలా - టేబుల్స్పూను
* అల్లం - చిన్నముక్క
* బ్రెడ్పొడి - అరకప్పు
* ఉప్పు - తగినంత
* ఆవాలు - అరచెంచా
* మినప్పప్పు - చెంచా
* కరివేపాకు రెబ్బలు - కొన్ని
* చిక్కని పెరుగు - ఒకటిన్నర కప్పు
* కారం
* చాట్మసాలా - అరచెంచా చొప్పున
* నూనె - వేయించేందుకు సరిపడా.
చింతపండు చట్నీ కోసం
* చింతపండు- అరకప్పు
* బెల్లం -రెండు కప్పులు
* నీళ్లు - రెండు కప్పులు
* వేయించిన జీలకర్రపొడి - టేబుల్స్పూను
* నల్లఉప్పు - అరచెంచా
* కారం - చెంచా
* మిరియాలపొడి - చెంచా
* ఉప్పు - కొద్దిగా
* శొంఠిపొడి - అరచెంచా.
తయారుచేయు విధానం
ముందుగా చింతపండు చట్నీ తయారు చేసుకోవాలి. చింతపండును ఓ గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి కాసేపు నాననివ్వాలి. తరవాత గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపితే చాలు. దీన్ని డబ్బాలోకి తీసుకుంటే రెండు రోజులు నిల్వ ఉంటుంది.
ఇప్పుడు వడలు చేసుకోవాలి. రాజ్మాను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు నీళ్లు వంపేసి మరీ గట్టిగా, అలాగని మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి
. ఇందులో ఉడికించిన ఆలూ ముద్దా, ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిర్చి తరుగూ, గరంమసాలా, అల్లం తరుగూ, బ్రెడ్పొడీ, తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలపాలి. దీన్ని ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
ఇవి చల్లారేలోగా పెరుగును ఓ సారి గిలకొట్టి, అందులో కొద్దిగా ఉప్పూ, కారం, చాట్మాసాలా వేసి కలపాలి. తరవాత వడలు వేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఆవాలూ, మినప్పప్పూ, కరివేపాకు రెబ్బలూ వేయించి పెరుగుపై వేయాలి. చివరగా పైనుంచి చింతపండు చట్నీ పెరుగువడలపై పడేలా అలంకరిస్తే చాలు.
No comments:
Post a Comment